గవర్నర్ ని కలిసిన బీఎస్పీ నేతలు
హైదరాబాద్ ముచ్చట్లు:

బహుజన్ సమాజ్ పా ర్టీ నేతలు శనివారం నాడు రాష్ట్ర గవర్నర్ తమిళిసైను కలిసారు. బీఎస్పీ ఛీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సిట్ కాకుండా సీబీఐ విచారణ జరపాలని గవర్నర్ ని కోరాం. లీకేజీ అంశంపై అన్ని విషయాలు గమనిస్తున్నానని గవర్నర్ తెలిపారు. లీకేజీ దోషులను కాపాడే ప్రయత్నం చేసున్నారు. లీకేజీ లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరినీ పోలీసులు విచారించాలి. పేపర్ లీకేజీ అంశంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారు. జనార్దన్ రెడ్డి ని చైర్మన్ పదవి నుండి తీసేయాలి. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నవారిని బోర్డు సభ్యులుగా నియమించకూడదని అన్నారు. .
Tags; BSP leaders met the Governor
