లారీని ఢీ కొన్న బస్సు..ప్రయాణికులకు గాయలు
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం జాతీయ రహదారిలో బుధవారం తెల్లవారుజామున ఒక ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు, అతివేగంతో ముందు వెళ్తున్న లారీ ఢీకొని అదుపుతప్పి పొలాల్లో దూసుకెళ్లింది. బస్సులో ప్రయాణిస్తున్న 36 మంది ప్రయాణికులలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాల తరలించారు.
Tags: Bus collided with a lorry. Passengers injured

