కేన్సార్ అవగాహనా మారధాన్-పాల్గోన్న మంత్రి రజని
విశాఖపట్నం ముచ్చట్లు:
కేన్సర్ పై అందరూ అవగా హన కలిగి ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి విడదల రజని పిలుపునిచ్చా రు. ప్రపంచ కేన్సర్ దినోత్సవం సందర్భం గా … ఆర్.కె. బీచ్ లోని కాళీమాత టెంపుల్ వద్ద మహాత్మాగాంధీ కేన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన వాక్ మార థాన్ కార్యక్రమానికి మంత్రి విడుదల రజిని ముఖ్య అతిథిగా పాల్గని కార్య క్రమాన్ని ప్రారంభించారు.వాక్ మార థన్ కార్యక్రమాన్ని బీచ్ లో కాళీమాత టెంపుల్ నుండి వైఎంసిఎ వరకు నిర్వ హించారు.ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ … కేన్సర్ వ్యాధితో ఎంతో మంది పోరాడుతున్నారన్నారని, కేన్సర్ వ్యాధి మానవులను కబళి స్తోందన్నారు. ఒక కోటి మంది వరకు కేన్సర్తో చనిపోయినట్లు చెప్పారు. తీసుకునే ఆహారం కలుషితం కావడం వలన కేన్సర్ వ్యాధి సంక్రమిస్తుందని వివరించారు.కేన్సర్ పై అందరూ అవగాహన పెంచుకోవాలని పిలుపు నిచ్చారు. ఆరోగ్య శ్రీ కి సంబంధించి ప్రసీజర్లలో 400 ప్రొసీజర్లు ఒక్క కేన్సర్ కు సంబంధించినవి ఉన్నాయని, వైద్యానికి ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు చెప్పారు.
Tags: Cancer Awareness Maradhan-Participating Minister Rajani