తిరుమలలో ప్రముఖులు
తిరుపతి ముచ్చట్లు:
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, పుదుచ్చేరి హోంమంత్రి నమశ్శివాయం, మాజీ క్రికెటర్ కేదర్ జాదవ్, వైసీపి ఎమ్మెల్యే ఆదిమూలం, మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ మీడియాతో మాట్లాడుతూ… యాభై ఏళ్ళ అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఓ దళితుడు మల్లికార్జున్ ఖర్గే ఎన్నుకోబడుతున్నాడని,రాహుల్ గాంధీ పాదయాత్ర అద్భుతంగా, దిగ్విజయంగా కొనసాగుతోందన్నారు.. త్వరలో భారతదేశంలో పెను మార్పు రాబోతుందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు.
Tags: Celebrities in Tirumala