శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల ముచ్చట్లు:
సోమవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పుష్పగిరి మఠం పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామీజీ,మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యే,చింతా మోహన్ ఎక్స్ ఎంపీ,అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి,డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి దర్శించుకున్నారు.
వారికి టీటీడీ అధికారులు మహద్వారం వద్ద స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు.అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల తెలంగాణ ఎమ్మెల్యే హనుమంతరావు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకెళ్లాలని కోరుకున్నానని స్వామి వారి చేత రాజకీయాలు ఎప్పుడు మాట్లాడిన ఆయన తెలిపారు.
Tags: Celebrities who visited Srivara