ఏపీలో వర్షాలు కురిసే అవకాశం
మత్స్యకారులకు హెచ్చరిక
విశాఖపట్నం ముచ్చట్లు:
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. ఇవాళ తుపానుగా మారే అవకాశం ఉందన్నారు. తుపానుగా మారితే ‘మిధిలి’గా నామకరణం చేయనున్నారు. అది రేపు బంగ్లాదేశ్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

Tags: Chance of rain in AP
