పుంగనూరులో విద్యుత్ సమస్యలకు చెక్ -ఎంపీపీ భాస్కర్రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని మంగళం, చెలిమిగడ్డ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విద్యుత్లైన్ల మార్పిడి, స్తంబాల ఏర్పాటును తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న మంగళం నుంచి కృష్ణాపురంకు రోడ్డు సమస్యను పరిష్కరించి, రోడ్డు ఏర్పాటు ప్రారంభించారు. ఎంపీపీ మాట్లాడుతూ విద్యుత్ సమస్యలు చిన్నవాటిని కూడ పరిష్కరించేలా మంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు. మండలంలో అవసరమైన ప్రాంతాలలో విద్యుత్లైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే కూలిపోతున్న స్తంబాలను తొలగించి, నూతన స్తంబాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్న తక్షణమే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రాజారెడ్డి, రాంమోహన్రెడ్డి, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పాల్గొన్నారు.
Tags; Check for electricity problems in Punganur – MPP Bhaskar Reddy