శ్రీవారి సేవలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ దర్శించుకున్నారు .శనివారం ఈవో ధర్మారెడ్డి ప్రధాన న్యాయమూర్తి కుటుంబ సభ్యులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు నిర్వహించారు .ఈ సందర్భంగా వేద పండితులు ఠాకూర్ దంపతులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. న్యాయమూర్తి ఆలయ ప్రాంతాలను సందర్శించి ,ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు.

Tags: Chief Justice Thakur of the State High Court in Srivari Seva
