తెరాస, సిపిఐ శ్రేణుల ఘర్షణ
ఖమ్మం ముచ్చట్లు:
ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ లో సీపీఐ-తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సమక్షంలో సీపీఐ పార్టీ కి చెందిన పలువురు నాయకులు తెరాసలో చేరారు. ఈ నేపధ్యంలోఇరు పార్టీల మధ్య కొంత ఉద్రిక్తత నెలకొంది. జాన్ బాద్ తండా లో సీపీఐ కార్యకర్త మృతి చెందగా నివాళులు అర్పించేందుకు సీపీఐ నాయకుడు కమలాకర్ వచ్చారు.అక్కడున్న తెరాస కార్యకర్తలు అయనను అడ్డుకున్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనలో ఐదుగురికి గాయాలు అయ్యాయి.
Tags: Clash of Teras and CPI ranks