జడ్పీ చైర్మన్, ఎంపిపిల ఘర్షణ
నిజామాబాద్ ముచ్చట్లు:
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ బాలల సంరక్షణ కమిటీ సమావేశం రసాభాసగా మారింది. జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు, ఎంపిపి మాస్త ప్రభాకర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గురువారం జరిగిన సమావేశానికి ఎంపిపి ఆలస్యంగా రావడంతో గొడవ చెలరేగింది. ఎంపి ఆలస్యం రావడంపై జడ్పీ ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. నువ్వేంత అంటే నువ్వేంత అంటూ ఇరువురు తిట్టుకున్నారు. అధికారుల ముందే జెడ్పి చైర్మన్, ఎంపిపి తిట్టుకున్నారు. ఇద్దరు బిఅరెస్ నేతలే కావటంతో మిగతా సభ్యులు అవక్కాయ్యారు.
Tags: Clash of ZP Chairman, MPPs

