Natyam ad

జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ వెబ్ సైట్ ను ప్రారంభించిన సీఎం జగన్

అమరావతి ముచ్చట్లు:
 
పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేరనుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు అయన ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్లు(ఎంఐజీ)’లకు సంబంధించిన లేఅవుట్లు, వెబ్సైట్ను  ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ  వార్షిక ఆదాయం  రూ.18 లక్షల వరకు ఉన్నవారు అర్హులుగా నిర్ణయించినట్లు చెప్పారు. కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. అవసరం మేరకు 150. 200, 240 గజాల స్థలం ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు.  ప్రతీ పేదవాడికి సొంతిల్లు ఉండాలని ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.  ఇప్పటికే 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. ఇప్పటికే పేదల ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు.. తొలిదశలో ధర్మవరం, మంగళగిరి, రాయచోటి,  కందుకూరు, కావలి, ఏలూరులో ప్లాట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు. .
 
 
 
ప్రతి నియోజకవర్గంలో జగనన్న టౌన్షిప్లు ఏర్పాటు సిద్ధం అవుతున్నాయని అయన అన్నారు. అత్యంత పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. అన్ని చోట్లా పట్టణ ప్రణాళికా విభాగం నియమాల మేరకు లేఅవుట్లు సిద్ధం చేశామన్నారు. ప్రభుత్వ  ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లు, ధరలో 20 శాతం తగ్గింపు ఉంటుందని సీఎం జగన్ చెప్పారు. ప్లాట్ల ధరను నాలుగు వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు ఉంటాయని సీఎం చెప్పారు. వాణిజ్య సముదాయాలు, బ్యాంకులకు స్థలాల కేటాయింపు ఉంటుందని సీఎం జగన్ చెప్పారు. న్యాయపరమైన సమస్యలు లేని స్పష్టమైన టైటిల్ డీడ్తో ప్రభుత్వమే వేస్తున్న ఈ లే అవుట్లకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మొత్తం సొమ్ము నాలుగు వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. చెల్లింపు పూర్తయిన వెంటనే ప్లాట్లు అందజేయడం జరుగుతుందన్నారు. పదిశాతం ముందుగా చెల్లిస్తే ఇంటి నిర్మాణం చేస్తామన్నారు. వాయిదాల్లో మిగతా సొమ్ము చెల్లింపు చేయవచ్చునని అయన అన్నారు. పూర్తి పర్యావరణ హితంగా మొత్తం లే అవుట్లో 50 శాతం స్థలాన్ని మౌలిక వసతులు, సామాజిక అవసరాలకు కేటాయించారు. విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్ టైల్స్తో ఫుట్పాత్లు, ఎవెన్యూ ప్లాంటేషన్, తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, వరద నీటి డ్రెయిన్లు, పూర్తి విద్యుదీకరణ, వీధి దీపాలు వంటి వసతులు కల్పిస్తున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: CM Jagan launches Jagannath Smart Township website