పలమనేరులో సీఎం జగన్ బహిరంగ సభ- పోటేత్తిన జనం
పలమనేరు ముచ్చట్లు:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి పలమనేరులో ఎన్నికల ప్రచార సభను రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో కలసి నిర్వహించారు. ఒకవైపు మండుటెండ, మరోవైపు వర్షం కురుస్తున్న జనం లెక్కచేయకుండ జగన్ సభలో ఉండిపోయారు. జగన్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు, పవన్కళ్యాణ్లు ఉమ్మడి జెండాలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని , వారికి తగిన గుణపాఠం నేర్పుతామని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి జరిగివుంటే , ప్రజలకు మేలు జరిగి ఉందని నమ్మితేనే ఓట్లు వేయాలని, ప్రచార కర్తలుగా ప్రజలే నాకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి ఎన్.రెడ్డెప్ప, ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేగౌడులను సభకు పరిచయం చేశారు. వేలాది మంది జై జగన్ అంటు నినాదాలు చేయడం పలమనేరు నియోజకవర్గ ప్రజలను ఉత్తేజ పరిచింది.
Tags; CM Jagan’s public meeting in Palamaneru – crowded crowd