Natyam ad

నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ కట్టడంపై కమిషనర్ కు ఫిర్యాదు

మంథని ముచ్చట్లు:

నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ కట్టడంపై మేడగోని శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ కమిషనర్ కు గురువారం ఫిర్యాదు చేశారు.  మంథని పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ముందు సర్వేనెంబర్ 1013లో నిబంధనలు విరుద్ధంగా అక్రమంగా నిర్మిస్తున్న కట్టడంపై మంథని పట్టణానికి చెందిన మేడగోని శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది.  ఈ అక్రమ కట్టడం ఒక మహిళ పేరు మీద రైస్ మిల్లు యజమాని ఒల్లాల సత్యనారాయణ మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేస్తున్నట్లు శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయంలో జి ప్లస్1 కు అనుమతి తీసుకొని జి ప్లస్2 నిర్మాణం చేపట్టిన అధికారులు ఎవరూ అడ్డుకోలేదన్నారు.  ఏడు ఫీట్ల ముందుకు బాల్కనీ పెంచి నిర్మాణం  చేస్తున్నారని,  సేట్ బ్యాంక్ లేకుండా మున్సిపల్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మిస్తున్న భవనంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

Tags: Complaint to the commissioner about the illegal construction being constructed against the rules

Post Midle
Post Midle