దుర్గగుడిలో నకిలీ పాసుల కలకలం
విజయవాడ ముచ్చట్లు:
ఇంద్రకీలాద్రి కొండపై నకిలీ పాసులు కలకలంరేపుతున్నాయి. 500రూ టిక్కెట్ చెక్కింగ్ వద్ద నకిలీ పాసులతో వెళ్తున్న వారిని ఆలయ సిబ్బంది గుర్తించారు. అడ్డుకున్న సిబ్బందిపై తల్లి కొడుకులు వాగ్వాదానికి దిగారు. మీ అంతు చూస్తానని సదరు మహిళ సిబ్బందిని బెదిరించింది. ట్రస్ట్ బోర్డు మెంబర్ రాంబాబు పేరు చెప్పి సిబ్బందిని బెదిరించింది. పోలీసుల రంగప్రవేశంతో వివాదం సద్దుమనిగింది. నకిలీ పాసుల వ్యవహారంపై అధికారులకు సిబ్బంది ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
Tags: Confusion of fake passes at Durga temple

