కోర్టు ధిక్కరణ.. ఏపీలో ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులకు జైలుశిక్ష
అమరావతి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్లో కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. సర్వీసు అంశాలకు సంబంధించిన కేసులో..ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని ఐఏఎస్ బుడితి రాజశేఖర్, ఐఆర్ఎస్ రామకృష్ణకు నెల రోజుల జైలుశిక్షతో పాటు ₹2వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వీరిద్దరినీ వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. గతంలో ఉన్నత విద్యాశాఖలో కార్యదర్శిగా రాజశేఖర్, ఇంటర్ బోర్డు కమిషనర్గా రామకృష్ణ పనిచేశారు. ప్రస్తుతం సెలవుపై రాజశేఖర్ అమెరికాలో ఉండగా.. రామకృష్ణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఐజీగా ఉన్నారు.

Tags: Contempt of court.. Jail sentence for IAS and IRS officers in AP
