నిర్విరామంగా కొనసాగిన ఐటీ తనిఖీలు
కడప ముచ్చట్లు:
ప్రొద్దుటూరు పట్టణం బంగారు అంగళ్ల వీధిలో రెండవ రోజు శుక్వరారం ఆర్ధరాత్రి రాత్రి 12:30 గంటలకు కూడా ఐటీ తనిఖీలు కొనసాగాయి. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు దుకాణాల్లో తనిఖీలు మొదలుపెట్టిన సెంట్రల్ ఇన్కమ్ టాక్స్ అధికారులు, నిర్విరామంగా తనిఖీలు చేసారు. శనివారం కుడా తనిఖీలు జరిగాయి. ఇప్పటివరకు ఎలాంటి సమాచారం మీడియాకు సెంట్రల్ ఇన్కమ్ టాక్స్ అధికారులు వెల్లడించాలేదు. ప్రొద్దుటూరులోని బుశెట్టి జువెలర్స్ , శ్రీ గురు రాఘవేంద్ర జువెలర్స్ , తల్లం జువెలర్స్ , బుసెట్టి రాజశేఖర్ ఇల్లు , డైమండ్ షాప్ దుకాణాల్లో దాదాపు 40 మంది అధికారులు తనిఖీలు చేసారు.
Tags: Continuous IT audits

