Natyam ad

సినీ నిర్మాత బండ్ల గణేష్ మీద క్రిమినల్ కేసు.

హైద్రాబాద్ ముచ్చట్లు:

ఫిలిం నగర్ లో హీరా గ్రూపు సీ ఈ ఓ నౌహీరా షేక్ కి చెందిన రూ. 75 కోట్ల విలువైన ఇల్లు కబ్జా చేసిన బండ్ల గణేష్.ఇంటినీ ఖాళీ చేయమని అడిగేందుకు వెళ్ళిన నౌహేరా షేక్ ను నిర్బంధించి బెదిరింపులు.ఫిబ్రవరి 15 న ఘటన.ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోగా నౌహెరా షేక్ మీద కేసు నమోదు చేసిన ఫిలిం నగర్ పోలీసులు.ఈ వ్యవహారంపైతాజాగా డీజీపీకి ఫిర్యాదు చేసిన నౌహీరా షేక్.మరియు ఫోక్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో 14/3/2024 నాడు ఫిర్యాదు చేశారు. ఈ కేసు 26/3/2024 నాడు రిజిస్టర్ అయి కేసు నంబరు 416/36/2/2024 . పెండింగ్ లో ఉంది.తాజాగా ఉన్నతాధికారుల ఆదేశంతో బండ్ల గణేష్ మీద ఐపిసి 341,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఫిలిం నగర్ పోలీసులు.

Post Midle

Tags:Criminal case against film producer Bandla Ganesh.

Post Midle