Date:30/11/2020
అవనిగడ్డ ముచ్చట్లు:
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజక వర్గలో నివర్ తుపాన్ ప్రభావంతో అధిక వర్షాలు పడటంతో కోడూరు, నాగాయలంక మండలాల్లో నీట మునిగిన వరి పంట పొలాలను కలెక్టర్ ఇంతియాజ్ , అవనిగడ్డ శాసన సభ్యులు సింహాద్రి రమేష్ బాబు, దివి మర్కెటింగ్ యార్డ్ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు , ఆర్డీవో ఖాజావాలి పరిశీలించారు. నివర్ తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తామని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు సింహాద్రి రమేష్ మాట్లాడుతూ ఏ ఒక్క రైతుకు కూడా ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకు న్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
మార్చిలోగా వంశధార- నాగావళి అనుసంధానం
Tags: Crop loss to the attention of the CM