Natyam ad

సైబర్ అలర్ట్ -జిల్లా ఎస్పీ  వై.రిశాంత్ రెడ్డి

చిత్తూరు ముచ్చట్లు:

 


మీ వ్యక్తిగత సమాచారంతో పాటు మీ వేలి ముద్రలను తరచుగా సమాచారం నిమిత్తం ఎవరికైనా ఇస్తుంటారా ! అయితే మీ ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త !. ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు వేలి ముద్రలను ఆధారంగా చేసుకొని ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ తరహా మోసంలో మొదటగా సైబర్ నేరగాళ్లు మీ వ్యక్తిగత వివరాలను అనగా ఆధార్ కార్డు వివరాలు, మీ బ్యాంకు ఖాతా వివరాలు, మీ వేలి ముద్రలను వివిధ మార్గాల ద్వారా సేకరిస్తారు. ఆ విధంగా సేకరించిన మీ యొక్క ఖాతా, వేలి ముద్రల వివరాలను ఉపయోగించి మీ యొక్క ఖాతా నుండి డబ్బులను డ్రా చేసుకుంటున్నారు. ఈ విధమైన డబ్బును డ్రా చేసే పద్దతినే AEPS (Aadhaar Enabled Payment system) అని అంటారు. ఈ AEPS ద్వారా డబ్బులను పొందటం కోసం మీ యొక్క ఖాతాకు లింకు అయినటువంటి ఆధార్ కార్డు వివరాలతో పాటు మీ యొక్క వేలి ముద్రలు అవసరం. ఈ AEPS withdraw సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైతే ATM సౌకర్యం అందుబాటులో ఉండదో ఆ ప్రాంతాలలో నగదును ప్రజలు తీసుకోవడం కోసం కల్పించారు. ఈ రకంగా నగదును 10,000/- లోపు మన సౌకర్యం నిమిత్తం డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ రకంగా బ్యాంక్ ఖాతా ను బట్టి ఎన్ని సార్లయినా సైబర్ నేరగాళ్లు ఈ సౌకర్యాన్ని వినియోగించి ఖాతా దారుల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

Post Midle

🔹 మీరు బ్యాంక్ ఖాతాకు ఇచ్చిన ఆధార్ కార్డు ప్రూఫ్ స్థానంలో ఇతర ఐడి ప్రూఫ్ ను ఇవ్వండి.
🔹 మీరు తరచుగా మీ యొక్క ఖాతా బ్యాలెన్సు ను చెక్ చేసుకోండి.
🔹 మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని, వేలి ముద్రలను అనవసరంగా ఇవ్వకండి.
🔹 మీకు ఆధార్ ద్వారా డబ్బు ఉపసంహరణ అవసరం లేదు అనుకుంటే మీరు వెంటనే మీ బ్యాంక్ కి వెళ్లి మీ యొక్క ఖాతా కి ఉన్నటువంటి ఆధార్ ద్వారా డబ్బు డ్రా చేసుకునే ఆప్షన్ డిసేబుల్ చేపించుకోవాలి.
🔹Google play store నుండి mAdhaar యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని, ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత Open App కి వెళ్లి Access all కు allow చేయాలి.

రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ entry చేసి మొబైల్ కు వచ్చిన ఓటీపీ ని enter చేయాలి.

ఆధార్ నెంబర్ ను రిజిస్టర్ చేసుకోవాలి.

Enter Aadhaar number & CAPTCHA number

Requested OTP అని వస్తుంది.

Verify entry

Aadhar lock

 

 

Tags: Cyber Alert – District SP Y. Rishanth Reddy

Post Midle