టవర్ పైకి ఎక్కి దళిత సంఘాల నిరసన
చిత్తూరు ముచ్చట్లు:
ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ మీటింగ్ నిర్వహించలేదని శాంతిపురం మండల సచివాలయం వద్ద సెల్ టవర్ పైకి ఎక్కి దళిత సంఘాల నిరసన .నేడు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ మీటింగ్ నిర్వహిస్తున్నట్టు నోటిలుసులు జారీచేసిన సరే నిర్వహించలేదని అధికారులుపై తీవ్ర ఆగ్రహానికి గురైన దళిత సంఘాలు,అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేసారు. దళితులకు అన్యాయం జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని, న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసారు..ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ మీటింగ్ నిర్వహిస్తే తప్పా నిరసన కార్యక్రమం ఆపమని తేల్చి చెప్పారు.నిరసన లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, భారతీయ అంబేద్కర్ సేన, వీసీకే, మాల మహానాడు, దళిత గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags: Dalit communities protest by climbing the tower
