పుంగనూరులో దళిత నాయకుల నిరసన
పుంగనూరు ముచ్చట్లు:
రాజ్యాంగనిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని ఉర్రితీయాలని డిమాండ్ చేస్తూ దళిత నాయకులు శుక్రవారం స్థానిక అంబేద్కర్ సర్కిల్లో నిరసన తెలిపారు. మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రేగనపల్లెలో రఘురెడ్డి అనే వ్యక్తి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత నేతలు రాజు, నరసింహులు, మంజు, నాగరాజ,భాస్కర్, శంకరప్ప, కుమార్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Tags: Dalit leaders protest in Punganur