అక్టోబరు 29న పెద్దశేష వాహనంపై శ్రీ మలయప్ప దర్శనం
తిరుమల ముచ్చట్లు:
అక్టోబరు 29వ తేదీన నాగులచవితి పర్వదినం సందర్భంగా తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి తిరుమాడ వీధులలో పెద్దశేషవాహనంపై భక్తులకు దర్శమిస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్యపూజలందుకుంటున్నాడు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తాడు. అందుకే బ్రహ్మోత్సవ వాహనసేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఆ భగవంతుడు ప్రసాదించారు. కాగా, రాత్రి 7 నుండి 9 గంటల నడుమ పెద్దశేష వాహన సేవ జరుగనుంది.
Tags: Darshan of Sri Malayappa on the Peddashesha Vahanam on 29th October