డాక్టర్ పద్మావతి పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలి-సిపిఐ
ఎమ్మిగనూరు ముచ్చట్లు:
పట్టణంలో మచాని గంగప్ప ప్రభుత్వ వైద్యశాలయందు డాక్టర్ పద్మావతి గా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ సక్రమంగా వైద్యం అందించడంలో వైఫల్యం చెందుతున్నారని స్త్రీలకు రక్తం సరిగా లేదని ఉమ్మినీరు లేదని ఆపరేషన్ చేసిన కుట్టు నిలబడమని గర్భ సంచి పాడైన డెలివరీకి వచ్చిన వారితో మాట్లాడడం సరికాదని సిపిఐ ఆధ్వర్యంలో సీనియర్ అసిస్టెంట్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి తిమ్మగురుడు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సత్యన్న మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో ప్రతి గర్భిణీ స్త్రీకి వైద్యం అందాలి డెలివరీ నార్మల్ అయినా సిజేరియన్ అయినా వైద్యశాలలో నే జరగాలి ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో వేలకు వేలు డబ్బులు చెల్లించలేక వైద్యశాలకు వస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని వారు మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాల కు అదనంగా ఒక డైరెక్టర్ ను నియమించాలి 24 గంటలు వైద్య సేవలు అందించాలి స్కానింగ్ నెలకు రెండు సార్లు నిర్వహించాలి ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కర్నూలు జీ జి హెచ్ కు రెఫర్ చేయడం మానాలి వైద్యశాలయందు ప్రతి ఒక్కరికీ వైద్యం అందింత వరుకు సిపిఐ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కె సి జబ్బర్, బాలరాజు, ఎసురాజు, సమీ ఉల్ల ,కాజా ,ఇస్మాయిల్ ,సోహైల్ ముదస్సిర్, సమీర్, చిన్న ,నూరు తదితరులు పాల్గొన్నారు.
Tags; Departmental action should be taken against Dr. Padmavati-CPI