Natyam ad

పుంగనూరులో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని అన్ని గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కోరారు. మంగళవారం మండల కార్యాలయంలో సచివాలయ కార్యదర్శులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశాన్ని ఎంపీడీవో రాజేశ్వరి, తహశీల్ధార్‌ సీతారామన్‌, ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి,మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహస్‌తో క లసి నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయాల వారిగా జగనన్న కాలనీలు, రూ.20 లక్షలతో చేపట్టిన పనులు , ఆర్‌బికెలు , సచివాలయాలలో ఉన్న పెండింగ్‌ సమస్యలపై వివరాలు సేకరించారు. అలాగే మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలు నిర్వహించిన పల్లెబాట, గడపగడపకు కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారం గురించి చర్చించారు. మంత్రి ఆదేశాల మేరకు రెండు నెలల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి , ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు సిద్దం చేయాలన్నారు. సమస్యలు పరిష్కారంలో అలసత్వం వహించరాదని సూచించారు. కొంత మంది కార్యదర్శులపై ఆరోపణలు వస్తున్నాయని అవి పునరావృతంకాకుండ చూడాలన్నారు.

 

Post Midle

Tags: Development works should be accelerated in Punganur – MPP Bhaskar Reddy

Post Midle