Natyam ad

ఊంజల్ సేవలో ఆకట్టుకున్న శ్రీ సుబ్రహ్మణ్యం భక్తిసంగీతం

తిరుపతి ముచ్చట్లు:

 

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శనివారం సాయంత్రం ఊంజల్ సేవలో టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో  సుబ్రహ్మణ్యం బృందం నిర్వహించిన భక్తిసంగీతం ఆకట్టుకుంది.ఈ సందర్భంగా ‘శరణు శరణు విభీషణ…’, ‘జయ జయ రాఘవ….’, ‘రామచంద్రుడు ఇతడు….’, ‘పొడగంటి మయ్యా పురుషోత్తమ…’, ‘నారాయణ నారాయణ నీ నామమే…’ తదితర కీర్తనలు భక్తిభావాన్ని పంచాయి.ముందుగా ఉదయం ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు మంగళధ్వని వినిపించారు. ఆ తరువాత డా.డి.హయగ్రీవాచార్యులు ధార్మికోపన్యాసం చేశారు. సాయంత్రం భక్తిసంగీతం వీనులవిందుగా సాగింది. రాత్రి శ్రీమతి పిఎం.నాగమణి హరికథాగానం చేశారు.

 

Tags:Devotional music of Shri Subrahmanyam impressed in Oonjal Seva

Post Midle
Post Midle