రామసముద్రం తాహశీల్దారుగా ధైవరాజన్
రెవెన్యూ సమస్యలు తక్షణమే పరిష్కరిస్తానని హామీ…
రామసముద్రం ముచ్చట్లు:
రామసముద్రం మండల తాహశీల్దారుగా దైవరాజన్ శనివారం విధుల్లో చేరారు. ఈయన విజయవాడ సీసీఎల్ లో పనిచేస్తూ బదిలీపై రామసముద్రం మండల తాహాశీల్దార్ గా వచ్చారు.. ఇక్కడ ఇంచార్జ్ తహశీల్దారుగా పనిచేస్తున్న విశ్వేశ్వర శాస్త్రి ఇదే మండలంలో డీటీగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన దైవరాజన్ మాట్లాడుతూ మండలంలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, రెవిన్యూ సమస్యలను తక్షణమే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.ప్రభుత్వ భూముల సంరక్షణ, ఇసుక, మట్టి అక్రమ రవాణా అరికట్టడం, పగడ్బందీగా వాల్టా చట్టాన్ని అమలు చేయడం, రైతులు దరఖాస్తు చేసుకున్న వెంటనే పట్టాదారు పాసుపుస్తకాలు, వన్ బి, అడంగల్, విద్యార్థుల సర్టిఫికెట్లను అందజేస్తానని తెలిపారు. అంతకుముందు తహసీల్దార్ దైవరాజన్ కు మండల రెవెన్యూ ఉద్యోగులు సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు.
Tags; Dhaivarajan as Tahsildar of Ramasamudra