Natyam ad

కొత్త పింఛన్ల పంపిణి

నందికొట్కూర్ ముచ్చట్లు:
 
నందికొట్కూరు పట్టణంలో 2వ వార్డ్లలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కొత్త పింఛన్లను వితంతువులకు వయోవృద్దులు లబ్బిదారులకు స్వయంగా 2వ వార్డ్ కౌన్సిలర్ మొల్ల జాకీర్ హుస్సేన్  అద్వర్యం పింఛన్లు ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని మహా నాయకుడు మన ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అని అన్నారు.అర్హులైన ప్రతి అవ్వా తాత కళ్ళలో ఆనందం చూడాలనే తపనతోనే వారికీ ఆర్థికంగా భరోసా కలిగించే విదంగా 2,250 రూపాయలతో పాటు మరో రెండు వొందల యాభై రూపాయలు పెంచిన డబ్బుతో కలిపి మొత్తం 2,500 పెన్షన్లు 2వ వార్డ్ కౌన్సిలర్ అందజేశారు.ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ నాయకులు రహంతుల్లా,ముజీబ్,శాలిమియా,ఆజం,రియాజ్. అలాగే 2వ వార్డ్ సచివాలయ అడ్మిన్ మహేష్,సచివాలయ సిబ్బంది,వార్డ్ వాలంటీర్స్ పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Distribution of new pensions