పుంగనూరులో విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు పంపిణీ
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని కొత్తయిండ్లు ప్రభుత్వ హైస్కూల్లో పదవతరగతి చదువుతున్న విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు , స్కేళ్లు పంపిణీ చేశారు. శనివారం రూరల్ డెవలెప్మెంట్ సోసైటి చైర్మన్ డాక్టర్ జాన్ ఆధ్వర్యంలో కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డి పంపిణీ చేశారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు డాక్టర్ జాన్ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Tags; Distribution of pads and pens to students in Punganur
