పుంగనూరులో వేకువజాము నుంచి పెన్షన్లు పంపిణీ
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలో వేకువజాము నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కమిషనర్ నరసింహాప్రసాద్రెడ్డి, చైర్మన్ అలీమ్బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. మంగళవారం చైర్మన్ అలీమ్బాషా, కౌన్సిలర్లు పూలత్యాగరాజు, అమ్ము, అర్షద్అలి, కిజర్ఖాన్, నరసింహులు, రేష్మా, పద్మావతి భారతి, జయభారతి, నటరాజ, మమతారాణి, నయింతాజ్, సాజిదాబేగం లు తమ వార్డులలో పెన్షన్ల పంపిణీ చేశారు. సాయంత్రానికి 99 శాతం పెన్షన్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించారు.ఈ కార్యక్రమంలో వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

Tags: Distribution of pensions from early morning in Punganur
