పుంగనూరులో 250 మంది ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని కుమ్మరవీధిలో గల మదీనామసీద్ వారిచే 250 మంది పేద ముస్లింలకు రంజాన్తోఫాను గురువారం పంపిణీ చేశారు. పట్టణ ముస్లిం నాయకులు సికింధర్, కరీముల్లా, నౌషాద్, అయూబ్ఖాన్ ఆధ్వర్యంలో సుమారు రూ.2 లక్షలు విలువ చేసే నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. రంజాన్ను పురస్కరించుకుని ఈ తోఫాను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖాదర్బాషా, సయ్యద్బాషా, గౌస్పీర్, జావీద్, మస్తాన్, దాదాపీర్, బావాజాన్, ఖాసీమ్ తదితరులు పాల్గొన్నారు.
Tags; Distribution of Ramadan Tofa to 250 Muslims in Punganur