Natyam ad

సచివాలయాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

అనంతపురం ముచ్చట్లు:
 
సచివాలయ ఉద్యోగులు బాధ్యతగా తమ విధులు నిర్వహించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. జిల్లాలో పలు గ్రామ సచివాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయం పరిధిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి అవగాహన కల్పించాలని, అర్హులైన వారందరికీ పథకాల లబ్ధి చేకూర్చాలన్నారు. సచివాలయానికి వచ్చే సర్వీసులను ఎలాంటి పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.
సచివాలయం పరిధిలో 2వ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కరోనా ఓమిక్రాన్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. సచివాలయం పరిధిలో వివిధ శాఖల రెగ్యులర్ యాక్టివిటీలని జాగ్రత్తగా చేపట్టాలన్నారు. వర్షాల వల్ల పంటలు దెబ్బతినగా వచ్చే వేసవిలో పశువులకు ఎంత  పశుగ్రాసం అవసరం అవుతుందో ముందుగానే చూసుకోవాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన  పశుగ్రాసం సిద్ధంగా ఉంచాలన్నారు. సచివాలయ ఉద్యోగులు ప్రతి రోజు బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు చేయాలని, వాలంటీర్ లు వారంలో మూడు రోజులు తప్పనిసరిగా అటెండెన్స్ నమోదు చేయాలన్నారు. సచివాలయంలో అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల పోస్టర్లు ఖచ్చితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: District Collector who inspected the secretariats