Natyam ad

జనాలు కాపు కాస్తారా

విజయవాడ ముచ్చట్లు:
 
ఏపీలో అత్యధికంగా ఉన్న కాపులు ఏకమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకాలం గెలుపోటములని డిసైడ్ చేస్తూ..వేరే వాళ్ళని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్న కాపులు..ఈ సారి అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారు. అసలు ఏపీలో అత్యధిక ఓట్లు కాపు కులానికే చెందినవే. వారు ఇంతకాలం వేరే కులం చేతుల్లో ఉన్న పార్టీలని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేశారు. కానీ ఈ సారి మాత్రం కాపుల చేతుల్లోనే అధికారం ఉండాలని డిసైడ్ అయ్యారు. ఆ దిశగానే ఏపీలోని కాపులు నేతలు ఒక చోట చేరారు.అన్నీ పార్టీల్లో ఉన్న కొందరు కాపు నేతలు..తాజాగా హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. చిరంజీవి, పవన్ మాదిరిగా ఫెయిల్ అవ్వకుండా కాపులు అధికారం దక్కించుకోవాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్తితుల్లో వైసీపీ-టీడీపీలని దాటి పవన్ నేతృత్వంలోని జనసేన అధికారంలోకి రావడం జరిగే పని కాదు. పైగా కాపు నేతలు వైసీపీ-టీడీపీల్లోనే ఎక్కువ ఉన్నారు. ప్రాక్టికల్‌గా చూస్తే ఇదే నిజం. ఇప్పుడు ఆ రెండు పార్టీలని దాటి వేరే పార్టీని గెలిపించడం కష్టం.అందుకే ప్రస్తుతానికి కాపు నేతలు ఒకటి డిసైడ్ అయ్యారు. ఎవరికి వారు వేరు వేరు పార్టీల్లో ఉన్నారు. అలా వేరే పార్టీల్లో ఉంటూనే కాపు కులానికి ఎక్కువ ప్రాధాన్యత దక్కేలా చూసుకోవాలని నేతలు డిసైడ్ అయ్యారు. ఇక అంతవరకు అంతా బాగానే ఉంది…కానీ ఈ సారి కాపులు ఎవరికి మద్ధతు తెలపాలనే విషయంపై కూడా కాస్త క్లారిటీ వస్తున్నట్లు కనిపిస్తోంది.మెజారిటీ కాపు నేతలు వైసీపీకి యాంటీగానే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఎలాగో కాపులు వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. కానీ ఈ సారి ఆ పరిస్తితి కనిపించడం లేదు. పైగా పవన్ కల్యాణ్..టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ సారి టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి కాపులు కృషి చేసేలా ఉన్నారు. మరి చూడాలి ఏపీలో కాపుల రాజకీయం ఎలా ఉంటుందో?
 
జేడీ హాజరుపై చర్చలు
ఆయన అసలు పేరు వి.వి. లక్ష్మీనారాయణ. కానీ జేడీ లక్ష్మీనారాయణగా పేరు స్థిరపడిపోయింది. దీనికి కారణం ఆయన నిజాయితీ గల అధికారిగా పేరు తెచ్చుకోవడమే. జగన్ పై సీబీఐ కేసులను జేడీయే విచారించారు. దీంతో ఆయన పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది. జగన్ అభిమానులు జేడీని వ్యతిరేకించినా ఎక్కువ మంది ఆయనను అభిమానించారు. అందుకు కారణం ఆయనకున్న ట్రాక్ రికార్డు మాత్రమే.  సరే జేడీ లక్ష్మీనారాయణ సీబీఐ అధికారిగా ఇంకా సర్వీసు ఉన్నప్పటికీ ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. కొత్త పార్టీ పెడతారని భావించారు. ఆయన జనసేనలో చేరినా ఎవరూ ఆక్షేపించలేదు. విశాఖపట్నం పార్లమెంటుకు పోటీ చేసి గట్ట ిపోటీ ఇచ్చారు. జేడీ లక్ష్మీనారాయణ ఓటమి పాలయినా ఆయన జనం అత్యధికంగా మద్దతు పలికారు. దానికి కారణం ఆయన మీద ఉన్న సాప్ట్ కార్నర్ మాత్రమే.. అలాంటి జేడీ లక్ష్మీనారాయణ కాపు సామాజికవర్గం సమావేశాలకు హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఆయన కూడా కులం ముద్ర వేసుకున్నారు. ఇప్పటి వరకూ ఆయన ఒక సామాజికవర్గానికి చెందిన వారుగా ఎవరూ చూడలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కులాలు బలంగా పనిచేస్తాయి. తమ కులం వారినే ఆయా సామాజికవర్గాలు అక్కున చేర్చుకుంటాయి. కానీ జేడీ లక్ష్మీనారాయణ విషయంలో ఇప్పటి వరకూ కులం చూడలేదు. ఆయనను ఒక నిజాయితీగల అధికారిగానే చూశారు. తప్పటడగేనా? కులాలు, మతాలకు అతీతంగా అధికారిగా పనిచేసిన జేడీ లక్ష్మీనారాయణ ఇప్పుడు ఒక కులానికే పరిమితమైన నేతగా మిగిలిపోయారు. కాపు సామాజికవర్గం సమావేశాల్లో పాల్గొని ఆయన రాజకీయంగా తప్పటడుగు వేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత సామాజికవర్గం గురించి ఆలోచించడంలో తప్పులేదు కాని, జేడీ వంటి వారు ఇలాంటి సమావేశాలకు హాజరుకావడం రాజకీయాలకు మంచి సంప్రదాయం కాదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
పుంగనూరు ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడుగా ముత్యాలు
Tags: Do people cultivate?