శ్రీ కల్యాణ వేంకటేశ్వరునికి శేష శయన పానుపు విరాళం
తిరుపతి ముచ్చట్లు:
శ్రీనివాసమంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారికి హైదరాబాద్ కు చెందిన శ్రీ కల్లూరి రాము దంపతులు సోమవారం సాయంత్రం సుమారు 20 లక్షలు విలువ చేసే బంగారు పూత వేసిన రాగి శేష పానుపు విరాళంగా సమర్పించారు.
ఈ కార్యక్రమములో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ శ్రీమతి వరలక్ష్మి, ఆలయ సూపరింటెండెంట్ శ్రీ రణణయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆర్చకులు శ్రీ మురళి స్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రీ రాము కుటుంబసభ్యులకు అధికారులు శ్రీవారి బ్రేక్ దర్శనమును ఏర్పాటు చేసి స్వామివారి ప్రసాదాలు అందించారు.
Tags:Donation of the remaining bed bugs to Sri Kalyana Venkateswara

