Natyam ad

బీజేపీ  నాయకుడు ఉరిపై అనుమానాలు

శ్రీనగర్ ముచ్చట్లు:



జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ నేత మరణం వివాదాస్పదం అవుతోంది. కథువా జిల్లాలోని హీరానగర్ ప్రాంతంలో మంగళవారం బీజేపీ నాయకుడు అనుమానాస్పద రీతిలోొ చెట్టుకు వెలాడుతూ కనిపించాడు. బీజేపీ నాయకుడు సోమ్ రాజ్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది హత్యా.. ఆత్మహత్యా అని తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. హీరానగర్ పట్టణానికి చెందిన సోమ్ రాజ్ గత మూడు రోజుల నుంచి కనిపించడం లేదు. అయితే ఈ క్రమంలోనే ఓ చెట్టుకు ఉరేసుని ఉన్న శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అయితే మృతదేహంపై రక్తపు మరకలను గుర్తించారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం సోమ్ రాజ్ ను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమ్ రాజ్ మరణ వార్త తెలియగానే.. పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.బీజేపీ నేత సోమ్ రాజ్ మృతిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. పోస్ట్ మార్టం కోసం నలుగురు డాక్టర్ల బోర్డుతో సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సి ఉందని.. విచారణ జరుగుతుందని కథువా ఎస్ఎస్పీ ఆర్ సీ కొత్వాల్ వెల్లడించారు. మృతిపై విచారణ చెస్తున్నామని పోలీసులు తెలిపారు.

 

Tags: Doubts on BJP leader’s hanging

Post Midle
Post Midle