Date:23/01/2021
సోమల ముచ్చట్లు:
మండలానికిచెందిన ఆవులపల్లి గ్రామంలో రైతు మెహన్ పొలంలో వరుసల పద్దతిలో సాగుచేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పుంగనూరు ఏడి లక్ష్మణ్ నాయక్ సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూప్రతి రైతు కుడా డ్రమ్ సీడర్ లేదా శ్రీ వరి లేదా వరుసల పద్దతిలో వరి పంటను సాగుచేయడం వలన రైతుల ఇంట సిరులపంట అన్నారు.రైతుతక్కువ ఖర్చుతో అధిక దిగుబడి ఆదాయం పొందవచ్చు అని తెలిపారు.ఈ ఏడాది అధికవర్షాలు,ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని మంచిదిగుబడినివ్వడం,కూలీల సంఖ్య కూడాతక్కువగా వుండటం, తక్కువపు
రుగులు తెగుళ్ల వ్యాప్తి మొదలైనటువంటి లాభాలు రైతులకు ఈ పద్దతిలో వుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఒ షణ్ముగం, ఎఈఒ హర్షవర్ధన్, యాసిన్, విఎఎకుమార్, వనజ రైతులు పాల్గొన్నారు.
పుంగనూరులో 23న జాబ్మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి
Tags: Drum cedar method crop farmers’ home crop