Natyam ad

సింహాచలం లో ఘనంగా ముగిసిన దుర్గాదేవి మహోత్సవాలు

మూడు వేల మంది భక్తులుకు అన్నసంతర్పణ
ఘనంగా అమ్మవారి నిమజ్జనోత్సవం

సింహాచలం ముచ్చట్లు:


సింహాచలం ఆయిల్ మిల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గా దేవి మహోత్సవాలు శనివారం నాటితో ఘనంగా ముగిసాయి. గత నెల 26 న ఈ ఉత్సవాలు శ్రీ గణేష్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రారంభం కాగా  శనివారం రాత్రి తో ముగిసాయీ.  గడిచిన 39 ఏళ్లుగా ఇక్కడ వినాయక చవితి ఉత్సవాల తో పాటు గత కొన్నేళ్లుగా దుర్గా దేవి అమ్మవారి మహోత్సవాలు క్రమం తప్పకుండా జరుపుతున్నారు. ఇక ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.. మధ్యాహ్నం మూడు వేల మంది భక్తులు కి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు.. సాయంత్రం పలు విచిత్ర వేషధారణల నడుమ అమ్మవారిని నిమజ్జనోత్సవము  ఘనంగా జరిపించారు.. అప్పన్న ధర్మ కర్తల మండలి సభ్యులు, శ్రీ గణేష్ యువజన సేవా సంఘం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, కార్యవర్గ సభ్యులు అక్కి రెడ్డి శ్రీనివాసరావు. మధు, అప్పలరాజు, గంట్ల సునీల్ , వెంకటేష్, పండు, చందు, కొల్లి చిన్న, పెదసతీష్, చిన్నారావు, సురేష్ , శాస్త్రి రావు,తదితర సభ్యులంతా పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Durga Devi Mahotsavam ended grandly in Simhachalam

Post Midle