మార్చి 10న విదేశీ నాణేల ఈ-వేలం
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారికి భక్తులు కానుకగా సమర్పించిన యుఎస్ఏ, మలేషియా దేశాలకు చెందిన నాణేలను మార్చి 10వ తేదీన ఈ-వేలం వేయనున్నారు. మలేషియా నాణేలకు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, యుఎస్ఏ నాణేలకు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ-వేలం జరుగనుంది.ఇతర వివరాల కోసం మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in లేదా www.tirumala.org వెబ్సైట్ను గానీ సంప్రదించగలరు.
Tags: E-auction of foreign coins on March 10