Natyam ad

అనంతపురములో ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకట రామి రెడ్డి  ఎన్నికల ప్రచారం

అనంతపురము ముచ్చట్లు:

ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్  పర్యటన వివరాలు
1) 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనంతపురము నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుత స్థానిక శాసన సభ సభ్యులు  అనంత వెంకట రామి రెడ్డి  ఆధ్వర్యంలో అనంతపురము పట్టణంలోని రుద్రంపేట నందు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్  బోయ గిరిజమ్మ  పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ ,  అనంత వెంకట రామి రెడ్డి తో పాటు గడప గడప తిరుగుతూ ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ-అభివృద్ధి పథకాలను, రానున్న రోజుల్లో వై.యస్.ఆర్.సి.పి ప్రభుత్వం ఏర్పడాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ, రానున్న రోజుల్లో అభివృద్ధి సంక్షేమం ఇలానే కొనసాగాలంటే 2024 ఎన్నికలలో ప్రజలందరూ కలసికట్టుగా వై.యస్.ఆర్.సి.పి ప్రభుత్వానికి అండగా నిలిచి  అనంత వెంకట రామి రెడ్డి ని ఎమ్మెల్యే గా గెలిపించి, జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని పార్టీ శ్రేణులతో కలిసి ఉత్సాహంగా ప్రచారం సాగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్లు, కార్పొరేటర్లు, వివిధ కార్పోరేషన్ చైర్ పర్సన్లు, డైరెక్టర్లు, వై.యస్.ఆర్.సి.పి సీనియర్ నాయకులు మరియు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Election campaign of MLA candidate Ananta Venkata Rami Reddy in Anantapuram

Post Midle