ఆర్టీసీ బస్సు పై బడిన విద్యుత్ స్తంభం
శ్రీ సత్యసాయి జిల్లా ముచ్చట్లు:
శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు పై విద్యుత్ స్థంభం విరిగి పడిన ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. పావగడ వైపు నుంచి పెనుకొండ కు వస్తున్న బస్సు బస్టాండ్ సమీపంలో ఆగి ఉండగా ఒక్కసారిగా రోడ్డు ప్రక్కన ఉన్న విద్యుత్ స్థంభం విరిగి బస్సుపై పడింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు… వరస కరెంట్ ప్రమాదాలుతో ఉమ్మడి జిల్లా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవ్వుతున్నారు.
Tags: Electric pole on top of RTC bus