Natyam ad

ఎల్కతుర్తి -సిద్ధిపేట విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం

మహబూబ్ నగర్ ముచ్చట్లు:
 
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి -సిద్ధిపేట (ఎన్-765 డి.జి) రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన కృషి ఫలించింది. ఈ రోడ్డు విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక, సాంకేతిక పరమైన అనుమతులకు ఆమోదం తెలపడంతో పాటు రూ.578.85 కోట్లను మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.ఫలితంగా ఎన్ హెచ్-765 డి.జి పరిధిలోని ఎల్కతుర్తి-సిద్ధిపేట విస్తరణ పనుల్లో భాగంగా మొత్తం 63.641 కి.మీల ( 69/978 నుండి 133/619 వరకు) మేరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. కేంద్రం అన్ని రకాల అనుమతులు తెలపడంతో ఇక పనులు మొదలు కావడమే మిగిలి ఉంది. ఈ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రెండు మేజర్ బ్రిడ్జిలను, 6 మైనర్ బ్రిడ్జిలను పునర్‌ నిర్మించనున్నారు. వీటితో పాటు కొత్తగా 1 మేజర్, 26 మైనర్ బ్రిడ్జిలను కూడా నిర్మించాల్సి ఉంటుంది.వాస్తవానికి ఎల్కతుర్తి- సిద్ధిపేట విస్తరణ పనులు చేపట్టాలంటూ బండి సంజయ్ కుమార్ గత కొన్ని నెలలుగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిలో భాగంగానే పలుమార్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆ శాఖ ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఎల్కతుర్తి – సిద్ధిపేట విస్తరణ పనులకు కేంద్రం ఆమోదం తెలపడం పై హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలకు ఆయన ప్రత్యేకంగా క్రుతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందనడానికి ఈ రోడ్డు విస్తరణ పనులకు నిధుల మంజూరే నిదర్శనమని ఆయన అన్నారు. ఈ రోడ్డు విస్తరణ పనులు తొందరగా పూర్తయితే కరీంనగర్, సిద్ధిపేట తదితర ప్రాంతాల ప్రజల ప్రయాణ ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు ఆయా ప్రాంతాల అభివృద్ధికి మరిన్ని అవకాశాలు మెరుగుపడతాయని బండి సంజయ్‌ తెలిపారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Elkathurthi-Siddhipeta expansion works finally salvation