Natyam ad

ఈటల ఒక చెల్లని రూపాయి

హైదరాబాద్ ముచ్చట్లు:


తెరాస శాసనసభా కార్యలయంలో పార్టీ విప్ లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు వివేకానంద, సురేందర్, ముఠా గోపాల్, నోముల భగత్, ఎమ్మెల్సీ దండే విఠల్ మీడియాతో మాట్లాడారు.ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ ఈటెల రాజేందర్ మాటలను చూసి జనం నవ్వుకుంటున్నారు. వార్డు మెంబర్ గా లేని ఈటెల ను మంత్రి గా చేసింది కేసీఆర్ యే. ఈటెల విశ్వాస ఘాతకుడు, తిన్నింటి వాసాలను లెక్క బెట్టారు. 2004 కు ముందు ఈటెల అడ్రస్ ఎక్కడ. ఓ ఏక లింగం బోడి లింగం లా మారారు. ఈటెల శిఖండి రాజకీయాలు చేస్తున్నాడు. ఆరోగ్య మంత్రిగా ఆర్థిక మంత్రిగా ఈటెల అవినీతికి పాల్పడ్డాడు.  కమ్యూనిస్టు కమ్యునలిస్టుగా మారారు.హుజూరా బాద్ లో ఈటెల ఓటమి ఖాయం. .అందుకే గజ్వెల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు. .ఈటెల కేసీఆర్ పై పోటీ చేసే సిపాయా. ఈటెల ఓ చెల్లని రూపాయి. పబ్లిసిటీ కోసమే ఈటెల తంటాలు. బీజేపీ లో ఈటెల ది బానిస బతుకు. వరదల్లోనూ బీజేపీ కండువాలు కప్పుతూ బురద రాజకీయం చేస్తోంది. ఈటెల వంటి శిఖండి లు తెలంగాణ కంట్లో నలుసు లా మారారు. కాంగ్రెస్ బీజేపీ లు తెలంగాణ ద్రోహుల తయారీ కర్మాగారాలు గా మారాయి.

 

 

పదవులు రాజకీయాలు తప్ప బీజేపీ కాంగ్రెస్ లకు ఈ వరదల్లో ప్రజల ఘోష పట్టడం లేదు. ఈటెల లాంటి వారు పేకాట లో జోకర్లుగా మారారు. బీసీ, ఎస్సిల భూములు కబ్జా చేసిన నీచ చరిత్ర ఈటెల ది. .ఈటెల చిట్టాను బయటకు తెస్తాం. కబ్జా చేసిన భూములను పేదలకు పంచుతాం. .బీజేపీ అవినీతి పరులు క్రిమినల్స్ కు అడ్డా గా మారింది. ఈటెల ఎగిరెగిరి మాట్లాడుతున్నారు ..నోరు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. ఈటెల దమ్ముంటే మళ్ళీ హుజురాబాద్ లోనే పోటీ చేసి గెలవాలి. డిపోతాననే తెలిసి ఈటెల కొత్త పల్లవి అందుకున్నారని అన్నారు.
.హుజురాబాద్ లో మొన్న ఈటెల కాంగ్రెస్, రేవంత్ ల సాయం తో గెలిచారు. .కాంగ్రెస్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈటెల హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఈటెల ఎక్కువ మాట్లాడితే తెలంగాణ సమాజం ఆయన నాలుక చీరేస్తాం. ఈటెల నల్లికుట్ల రాజకీయాలు నడవవని హెచ్చరించారు.

 

 

Post Midle

తెలంగాణ రాజకీయాల్లో ఓ విష పురుగు ఈటెల. ఈటెల మోడీ కి అమిత్ షా గులాం లా పని చేస్తున్నాడు. మంత్రిగా ఉన్నపుడు కాళేశ్వరం ను అద్భుత ప్రాజెక్టు గా పేర్కొన్న ఈటెల ఇపుడు పార్టీ మారి తిడుతున్నారు. ఈటెల గోడ మీద పిల్లి. ఆర్థిక మంత్రిగా చేసి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. 20 మంది టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఈటెల అంటున్నారు.. కనీసం వార్డు మెంబర్ కూడా టచ్ లో లేరు. రాబోయే రోజుల్లో బీజేపీ నుంచే టీ ఆర్ ఎస్ లో చేరికలుంటాయి. బీజేపీ భావజాలాన్ని ప్రజలు బొంద పెట్టే రోజులు ఎంతో దూరం లో లేవు. .అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టె రకం ఈటెల. .హుజురాబాద్ లో ఈటెల ను గెలిపించినందుకు ప్రజలు భాధ పడుతున్నారు. ఈటెల కు తగిన బుద్ధి చెబుతామని అన్నారు.
కేసీఆర్ లేక పోతే ఈటెల కు డ్రెస్ లేదు అడ్రస్ లేదు. కేసీఆర్ గజ్వెల్ లో ఈ సారి పోటీ చేయనని ఎవరికి చెప్పారు. గవర్నర్ బీజేపీ కండువా కప్పుకుని రాజకీయాలు మాట్లాడితే మంచిది. .కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటానికి గవర్నర్ ఎవరు. గవర్నర్ రాజకీయం చేస్తున్న తీరు ను మీడియా కూడా ఖండించాలి. .గతం లో గవర్నర్లు హుందా గా ప్రవర్తించే వారు. క్లౌడ్ బరస్ట్  గురించి గవర్నర్ మాట్లాడటానికి ఆమె ఏమైనా శాస్త్ర వేత్తనా అనిప్రశ్నించారు.

 

 

 

ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ ఈటెల ది వ్యాపార నైజం..ఆయనకు ఏ సిద్ధాంతం లేదు. గజ దొంగ పార్టీ లో ఈటెల చేరి నీతులు చెబుతున్నారు. అనామకుడైన ఈటెల ను సీఎం కేసీఆర్  మంత్రి చేశారు. .ఈటెల కు బీజేపీ లో ఏముందని నాయకులు ఆయన తో టచ్ లో ఉంటారు. బీజేపీ తెలంగాణ లో ఎదగడానికి అవకాశం లేదు. బీజేపీ తెలంగాణ లో సింగిల్ డిజిట్ దాటదు. మోడీ రెండు నెలలు హైద్రాబాద్ లో ఉన్నా ఒక్క టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే బీజేపీ లో చేరడు. దమ్ముంటే ఈటెల టచ్ లో ఉన్న వారి పేర్లు బయట పెట్టాలి. తెలంగాణ లో ప్రభుత్వాన్ని పడగొట్టడం మోడీ జేజమ్మ తరం కూడా కాదని అన్నారు.
ఎమ్మెల్యే కె. పి. వివేకానంద మాట్లాడుతూ 2004 లో కమలా పురం సీటు ను 32 మంది ఆశించినా కేసీఆర్ ఈటెల కు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ఈటెల అహంకారం తో బడుగు బలహీన వర్గాల దొర లా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ను విమర్శించే స్థాయి ఈటెల ది కాదు. మంత్రి గా ఈటెల బీసీ లకు ఏం చేయలేదు. తండ్రిలాంటి కేసీఆర్ ను ఈటెల విమర్శిస్తే తగిన శాస్తి తప్పదు. కాంగ్రెస్ బీజేపీ లకు ఓ ఎజెండా అంటూ లేదు. కేవలం కేసీఆర్ ను గద్దె దించడమే కాంగ్రెస్ బీజేపీ ల ఎజెండా గా మారింది. దీన్ని ప్రజలు ఆమోదించరని అన్నారు.

 

Tags: Etala is an invalid rupee

Post Midle