Natyam ad

పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలి

విశాఖపట్నం  ముచ్చట్లు:

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏయూ విసి ప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏయూ మెట్రోలజీ ఓసినోగ్రఫీ విభాగం ఆధ్వర్యంలో మొబైల్ ఎయిర్ పొల్యూషన్ వాహనాన్ని ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. తద్వారా వాతావరణంలోని కాలుష్యాన్ని అరికట్టడానికి వీలు కలుగుతుందన్నారు. గాలిలో కాలుష్యం పరీక్షించే సౌకర్యం ఈ మొబైల్ ఎయిర్ పొల్యూషన్ వాహనం ద్వారా వీలు కలుగుతుంది అన్నారు. సుమారు 50 లక్షల రూపాయల ఖర్చుతో ఈ వాహనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే వాతావరణంలోని ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ ఇతర వాయువుల సాంద్రత వాటి వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు. మొబైల్ ఎయిర్ పొల్యూషన్ లాబ్ ఉన్న ఏకైక యూనివర్సిటిగా ఆంధ్ర యూనివర్సిటీ పేరుగాంచడం ఆనందంగా ఉందన్నారు.

Post Midle

Tags;Everyone should work to protect the environment

Post Midle