దైవదర్శనానికి వెళ్తూ ఘోర రోడ్డు ప్రమాదం
-శ్రీశైలం వెళ్లే దారిలో తెలకపల్లి మండలంలో ప్రమాదం
-ఆటో, ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి
వికారాబాద్ ముచ్చట్లు:
వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటుపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి భీమయ్య కుటుంబ సమేతంగా శ్రీశైలం దైవదర్శనానికి ఆటోలో ఉదయం బయలుదేరారు. శ్రీశైలం వెళ్లే దారిలో నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో ఆర్టీసీ బస్సు,ఆటో ఢీ కొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వ్యక్తులను తెలకపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. తీవ్రంగా గాయపడిన వారిలో సైతం మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలిసింది.
Tags: Fatal road accident while going to Goddarshan