Natyam ad

విజయవాడలో ఫైర్ యాక్సిడెంట్-ఇద్దరు సజీవదహనం

విజయవాడ ముచ్చట్లు:


నిర్లక్ష్యం.. అంతకుమించిన అజాగ్రత్త అమాయకుల బతుకుల్ని బుగ్గిపాల్జేసింది. పండుగ పూట పెను విషాదాన్ని నింపింది. దీపావళి వేళ జరిగిన ఈ ఘోరం కడుపుకోతను మిగిల్చింది. విజయవాడ ఫైర్‌ ఇన్సిడెంట్‌లో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నిప్పుతో చెలగాటం. అది కూడా టపాసులు అమ్మేచోట చోట.. ఇది చాలదా బీభత్సం జరిగిపోవడానికి. విజయవాడలో ఇవాళ ఉదయాన్నే జరిగిన అగ్నిప్రమాదం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. గాంధీనగర్‌లోని జింం‌ఖానా గ్రౌండ్స్‌లో 19 స్టాళ్లను ఏర్పాటు చేసుకుని బాణాసంచా విక్రయిస్తున్నారు వ్యాపారులు. ఉన్నట్టుండి ఓ షాప్‌లో చెలరేగిన మంటలు క్షణాల్లోనే పక్క వాటికి వ్యాపించాయి. మొత్తం 3 షాపులు మంటల్లో తగలబడిపోయాయి. ఇద్దరు సజీవ దహనం అయిపోయారు.మృతులు విజయవాడకు చెందిన కాశీ, పిడుగురాళ్లకు చెందిన సాంబగా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు సీపీ. బాధ్యులపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఫైర్‌ యాక్సిడెంట్‌కు వైసీపీ నేతలే బాధ్యత వహించాలంటోంది సీపీఎం. ఒక్కో షాపునకు రెండు లక్షల డబ్బులు తీసుకొని పర్మిషన్‌ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు సవాలక్ష ఆంక్షలు పెట్టే అధికారులు..

 

 

 

క్రాకర్‌ షాప్స్‌కు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.జింఖానా గ్రౌండ్స్‌లోని బాణాసంచా స్టాల్‌లో మంటలు చెలరేగి.. 18 టపాసుల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. తొలుత మూడు స్టాల్స్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత మంటలు అన్ని దుకాణాలకు వ్యాపించాయి. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. నిప్పు అంటుకోవడంతో టపాసులు ఒక్కసారిగా పేలిపోయి, స్టాల్స్ అన్నీ దగ్ధం అయ్యాయి.  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరగడానికి గల కారణాలపై లోతుగా విచారిస్తున్నారు. ప్రమాదం నేపథ్యంలో ఇవాళ టపాసుల అమ్మకాలు జరపొద్దని అధికారులు సూచించారు.
తిరుపతిలో..
ఇదిలాఉంటే.. తిరుపతి వడమాల పేటలో కూడా భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాణాసంచా విక్రయిస్తున్న రెండు షాపుల్లో మంటలు చెలరేగడంతో.. రెండు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.ఫైర్‌ ఇన్సిడెంట్‌ నేపథ్యంలో అలర్ట్‌ అయ్యింది వైద్యశాఖ. ప్రమాద బాధితులకు ట్రీట్‌మెంట్‌ అందించేందుకు ప్రత్యేకంగా వైద్యుల్ని అందుబాటులో ఉంచారు.

 

Post Midle

Tags: Fire accident in Vijayawada – two burnt alive

Post Midle