Natyam ad

ఏపీలో ఐదుగురు ఐపీఎస్ లు బదిలీ

అమరావతి ముచ్చట్లు:


కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ బదిలీ అయ్యారు. సిద్దార్ద కౌశల్ ను కర్నూలు జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మరో నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేసారు.  కృష్ణా జిల్లా ఎస్పీగా పి జాషువా ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. కోనసీమ ఎస్ పి సుబ్బారెడ్డి పై బదిలీ వేటు పడింది. కోనసీమ కొత్త ఎస్పీగా సుధీర్ కుమార్ రెడ్డి, విజయవాడ డీసీపీగా విశాల్ గున్ని బదిలీ అయ్యారు.

 

Tags: Five IPS transfers in AP

Post Midle
Post Midle