Natyam ad

మునుగోడుపై ఫోకస్

నల్గొండ ముచ్చట్లు:


మునుగోడు బై ఎలక్షన్‌పై టిఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చింది. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ కసరత్తు దాదాపు పూర్తి చేసిందట గులాబీ పార్టీ. పలువురి పేర్లను అభ్యర్థులుగా పెట్టి సర్వేలు చేయించి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో వారికున్న ఇమేజ్‌పై ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మునుగోడు బై ఎలక్షన్‌కు అభ్యర్థి విషయంలో టిఆర్ఎస్ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన సీనియర్ నేతలతో చర్చలు జరిపిన తర్వాత అధికారికంగా అభ్యర్థిపై ప్రకటన చేసే అవకాశం ఉందట.మునుగోడు అభ్యర్థి ఎంపికపై పలు రకాలుగా నివేదికలు తెప్పించుకుంది టిఆర్ఎస్. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, కర్నే ప్రభాకర్ పేర్లతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వేలు చేయించిందని సమాచారం. టిఆర్ఎస్ చేయించిన సర్వేలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డివైపే జనం మొగ్గు చూపారట. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత నియోజకవర్గం వదలకుండా కూసుకుంట్ల పర్యటనలు చేయడం ఆయనకు కలిసి వచ్చిందట.ఇటు నియోజకవర్గ ప్రజలకు కూసుకుంట్ల తెలిసిన ఫేస్‌గా తేలిందట. ఇటు పార్టీ అధిష్టానం కూసుకుంట్ల విషయంలో సానుకూలంగా ఉందని టాక్‌. దీంతో ఆశావహుల బుజ్జగింపులు పూర్తయిన తర్వాత మునుగోడు అభ్యర్థిని టిఆర్ఎస్ ప్రకటించేందుకు సిద్ధం అవుతుందట.ఇప్పటికే పోటీకి సిద్ధం కావాలని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టిఆర్ఎస్ సంకేతాలు పంపిందట. దీంతో మునుగోడు అభ్యర్థిగా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు అధికారికంగా ప్రకటించడమే మిగిలిఉంది.

 

 

కూసుకుంట్లకు వ్యతిరేకంగా సమావేశం
టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి రాగం భగ్గుమంటోంది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అభ్యర్థిత్వం ఖరారుపై టీఆర్ఎస్ పార్టీలోని ఆశావాహుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిజానికి మునుగోడు నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్‌లో టికెట్ ఆశించే వారి జాబితా పెద్దగా ఉంది. ఇందులో బీసీ సామాజికవర్గానికి చెందిన వారే అధికంగా ఉన్నారు. అయితే టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని మొదట్నుంచీ నియోజకవర్గ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. దీంతో టీఆర్ఎస్ అధిష్టానం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఇటీవల టీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తి నేతలతో మంత్రి జగదీశ్ రెడ్డి నేరుగా మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అక్కడ ఓకేనంటూ తల ఊపిన నేతలు.. ఏకంగా 300 మందితో సమావేశం కావడంతో షాక్ తగిలినట్టయ్యింది. ఓవైపు మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో ఈనెల 20న నిర్వహించే సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లు చూస్తుంటే..

 

 

 

Post Midle

మరోవైపు టీఆర్ఎస్ నేతలు ఈ తరహా సమావేశాన్ని నిర్వహించడం ఆ పార్టీ నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుండడం గమనార్హం.మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే తాము సహించబోమని లోకల్ టీఆర్ఎస్ లీడర్లు గళమెత్తారు. అంతటితో ఆగకుండా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ చౌటుప్పల్ పరిధిలోని ఆంథోల్ మైసమ్మ దేవాలయం వద్ద ఓ ఫంక్షన్ హాల్‌లో మునుగోడు నియోజకవర్గానికి చెందిన దాదాపు 300 లీడర్లు రహస్యంగా భేటీ అయ్యారు. పార్టీ అధిష్టానం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేస్తే.. ఏం చేయాలనే దానిపైనా చర్చించినట్టు తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గంలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలతో పలువురు క్రీయాశీలక కార్యకర్తలు హాజరయ్యారు. ఏదీఏమైనా ఈసారి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మునుగోడు టికెట్ కేటాయిస్తే.. మేం ఓడించి తీరుతామంటూ సొంత పార్టీ నేతలు శపథం చేయడం కలకలం రేపుతోంది.

 

 

 

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఉపఎన్నిక అంశం తెరపైకి రాకముందు నుంచే స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సొంత పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బాహాటంగానే పలుమార్లు ఆయన్ను వ్యతిరేకించిన దాఖలాలు లేకపోలేదు. ఇటీవల ఉపఎన్నిక ప్రస్తావన వచ్చినప్పుడల్లా టీఆర్ఎస్ ఆశావాహులు, లోకల్ లీడర్లు కూసుకుంట్లను వ్యతిరేకిస్తూనే వచ్చారు. కానీ జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి కూసుకుంట్ల వైపు మొగ్గుచూపుడంతోనే సీఎం కేసీఆర్ సైతం ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి తమ అసమ్మతి రాగాన్ని విన్పించేందుకు లోకల్ లీడర్లంతా భేటీ కావడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదిలావుంటే.. టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తోన్న కర్నాటి విద్యాసాగర్, బూర నర్సయ్యగౌడ్, నారబోయిన రవిలకే కేటాయించాలనే డిమాండ్ స్పష్టంగా విన్పిస్తుండడం గమనార్హం.

 

Tags: Focus on the past

Post Midle