Natyam ad

అన్నమయ్య జిల్లాలో విద్యుత్‌షాక్‌-నలుగురుమృతి

– ముగ్గరి పరిస్థితి విషమం

 

బి.కొత్తకోట ముచ్చట్లు:

Post Midle

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పిటిఎం వద్ద జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా , ముగ్గరు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. బి.కొత్తకోట మండలానికి చెందిన వారు పిటిఎం మండలంలో జరిగిన కానుగమాకులపల్లెలో గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైయ్యారు. అక్కడ భారీ గాలులకు టెంటు లేచిపోయి విద్యుత్‌ తీగలకు తగడంతో నలుగురు విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడిక్కే మృతి చెందారు. మరో ముగ్గరు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

Tags: Four electric shocks in Annamaya district

 

Post Midle