శ్రీవారిని దర్శించుకున్న గౌతమ్ గంభీర్
తిరుమల ముచ్చట్లు:
శ్రీవారిని బీజేపీ ఎంపి మాజీ క్రికెటర్ గౌతమ్ గంబీర్ గురువారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తెల్లవారు జామున సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగాధ్వజ స్తంభానికి మొక్కి మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందచేశారు.అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనం అద్భుతంగా జరిగిందన్నారు. వరల్డ్ కప్ని సాధించే అవకాశాలు భారత్కి ఎక్కువగా ఉన్నాయన్నారు. 140 కోట్ల మంది భారతీయులు.కోరికను ఇండియన్ టీం నెరవేరుస్తుందని గౌతమ్ గంభీర్ అన్నారు.

Tags: Gautam Gambhir who visited Lord
