-ఇద్దరు మృతి: మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
-బాధితులు ఆంధ్రప్రదేశ్ నర్సరావుపేట కు చెందిన వారు
Date:23/02/2021
పెద్దపల్లి ముచ్చట్లు:
పెద్దపల్లి జిల్లా రామగుండం మాల్యాలపల్లి రైల్వే బ్రిడ్జి మూల మలుపు వద్ద మంగళవారం తెల్లవారు జామున షిఫ్టు కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో ఉన్న ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు కారులో ఇరుక్కోవటంతో పోలీసులు 108 సిబ్బంది సహకారంతో బయటికి తీశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరిని అత్యవసర చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్ నర్సరావుపేట కు చెందిన వీరు బంగారు వ్యాపారులుగా పోలీసులు గుర్తించారు. బంగారం విక్రయాల కోసం ఇక్కడికి వచ్చి తెల్లవారుజామున తిరుగు ప్రయాణంలో సంఘటన జరిగినట్లు తెలుస్తుంది. కాగా సంఘటన స్థలంలో కిలో బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Tags: Ghora road accident in Peddapalli district