గోదావరిని తోడేస్తున్నారు
వరంగల్ ముచ్చట్లు:
గోదావరి తీరంలో ఇసుక తోడేళ్ల రాజ్యం నడుస్తోంది. అందిన కాడికి సహజ సంపదను కొల్లగొడుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించాల్సిన ఆదాయాన్ని తమ ఖజానాలో ఎంచక్కా జమ చేసుకుంటున్నాయి. కళ్ల ముందే అక్రమ దందా కనిపిస్తున్నప్పటికీ అధికారులు తమకేం పట్టిందిలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయా శాఖల అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుం డడంతో ఇసుక అక్రమ రవాణా ‘మూడు లారీలు.. ఆరు అదనపు బకెట్లు’గా విలసిల్లుతోంది.జయశంకర్భూపా
కాగా, ఈ దందాను టీఎస్ఎండీసీ అధికారులు, కాంట్రాక్టర్లు దగ్గరుండి మరీ నడిపిస్తున్నట్లు సమాచారం. క్వారీ దగ్గర టీఎస్ఎండీసీ సిబ్బంది రూ. 200 నుంచి రూ. 300 వరకు లారీల డ్రైవర్ల వద్ద అక్రమంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇసుక అక్రమ తరలింపులో వేబ్రిడ్జిలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఇసుకను తక్కువ తూకం వేస్తూ నిర్వాహకులు తప్పుడు కాగితాలు ఇస్తున్నట్లు సమాచారం. ఎక్కువ లోడు ఉన్నా తక్కువగా ఉన్నట్లుగా వేబిల్లులు జారీ చేస్తున్నారు. ఇందుకు ప్రతిఫలంగా వేబ్రిడ్జిల వద్ద లారీల లోడును తూకం వేసేందుకు రూ.100 నుంచి రూ. 500 వరకు ఇస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఆయా చోట్ల మామూళ్ల వ్యవహారం జోరుగా సాగుతుండడంతో రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక నగరాలకు తరలిపోతుంది. దీన్ని అరికట్టాల్సిన రెవెన్యూ, మైనింగ్, రవాణా, పోలీసుశాఖ అధికారులు ఒకరిపై ఒకరు నెపం వేస్తూ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. ఇసుక దందా రాత్రివేళలో విచ్చలవిడిగా సాగుతోంది. ఈ దందాకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులు తమ మౌనంతో వత్తాసు పలుకుతుండడం గమనార్హం. దీన్ని అలుసుగా తీసుకుని కొంత మంది కాంట్రాక్టర్లు ఒక్క పర్మిట్కాగితం పైన రెండు ట్రిప్పుల లారీల అధిక లోడును తీసుకుపోతున్నారు. అయినా ఈ విషయాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్రెడ్డి ఆకాంక్ష
Tags: Godavari is being removed